హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Neelam Sahni: ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకం.. ఆమె బ్యా‌గ్రౌండ్ ఇదే..!

Neelam Sahni: ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకం.. ఆమె బ్యా‌గ్రౌండ్ ఇదే..!

నీలం సాహ్నికి నోటీసులు

నీలం సాహ్నికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. ప్రస్తుత ఎ‌స్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో.. ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియలో భాగంగా.. ముగ్గురి పేర్లను...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. ప్రస్తుత ఎ‌స్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో.. ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియలో భాగంగా.. ముగ్గురి పేర్లను జగన్ సర్కార్ ప్రతిపాదించింది. నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా చివరికి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్‌గా అవకాశం దక్కింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌కు ప్రతిపాదన పంపగా.. ఆయన ఆమోద ముద్ర వేశారు. నీలం సాహ్ని ఏపీ ఎస్‌ఈసీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గత రెండేళ్ల నుంచి ఆమె జగన్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. నీలం సాహ్ని 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆమె సేవలందించారు. నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా కూడా సేవలందించారు. విభజిత ఏపీలో రెండు కీలక పదవులు చేపట్టిన మహిళగా నీలం సాహ్ని చరిత్ర సృష్టించారు.

విభజిత ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళా అధికారి నీలం సాహ్నినే కావడం గమనార్హం. తాజాగా.. విభజిత ఏపీలో ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులైన తొలి మహిళ కూడా నీలం సాహ్నినే కావడం విశేషం. విభజిత ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళా అధికారి నీలం సాహ్నినే కావడం గమనార్హం. తాజాగా.. విభజిత ఏపీలో ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులైన తొలి మహిళ కూడా నీలం సాహ్నినే కావడం విశేషం.

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మైలాపల్లి శామ్యూల్ నియమితులు కాబోతున్నట్లు వార్తలొచ్చాయి. ముగ్గురు పేర్లు ప్రతిపాదించినప్పటికీ సీఎం జగన్ శామ్యూల్ వైపే మొగ్గుచూపినట్లు ప్రచారం జరిగింది. అయితే.. కేంద్ర పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్-2011 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసుగా పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు తమ ఎస్‌ఈసీకి 65 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని విధించాయి.

ఈ నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ప్రధానాధికారి నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని పాటించాలా లేక కేంద్ర నిర్ణయం అమలు చేయాలా అనే ప్రశ్న గవర్నర్‌కు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే.. 67 ఏళ్ల వయసు పైబడిన ప్రేమ్‌చంద్రారెడ్డి, శామ్యూల్ ఈ పోస్టు ఇవ్వడానికి గవర్నర్ సానుకూలత వ్యక్తం చేయకపోతే.. 65 ఏళ్ల లోపే వయసున్న నీలం సాహ్నిని గవర్నర్ నియమిస్తారని భావించిన సీఎం జగన్ ఆమె పేరును కూడా కొత్త ఎస్‌ఈసీగా ప్రతిపాదించారు. సీఎం జగన్ భావించినట్టుగానే గవర్నర్ నీలం సాహ్నిని కొత్త సీఎస్‌గా నియమించారు.

First published:

Tags: Andhra Pradesh, Cm jagan