విశాఖ ఏజెన్సీలో అలజడి..పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు
జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి.
news18-telugu
Updated: August 19, 2019, 6:49 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: August 19, 2019, 6:49 PM IST
విశాఖ ఏజెన్సీలో అలజడి రేగింది. జీకే వీధి-కొయ్యూరు మండలాల సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మండపల్లి అటవీ ప్రాంతంలో 45 నిమిషాల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టలు అగ్రనేత చలపలి ఆధ్వర్యంలో 20 మంది మావోయిస్టులు మండపల్లి ప్రాంతంలో సమావేశమవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారా? లేదంటే చనిపోయారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..
ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...
బ్రాండ్ మీరు చెబితే.. బ్రాండింగ్ నేను చేస్తా... పవన్ కళ్యాణ్
పవన్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్...
Loading...