ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు పన్నుల రూపంలో ఇస్తున్న నిధులను తిరిగి ప్రజలకు పథకాల రూపంలో ఇస్తోంది. వీలైనంతవరకూ అవినీతి జరగకుండా ఉండేందుకు లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు చేరేలా చేస్తోంది. ఐతే... ఇప్పటికీ చాలా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచీ లబ్దిదారులకు డబ్బులు చేరట్లేదు. ఉదాహరణకు తిరుపతిలోని వరదయ్యపాలెం SBI బ్యాంకునే తీసుకుంటే... అక్కడ డ్వాక్రా మహిళలు, రైతులు ఉదయం నుంచీ పడిగాపులు పడ్డారు. అయినా ఇంకా చాలా మందికి డబ్బులు చేరలేదు. మండుటెండల్లో కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా డబ్బుల కోసం ఎదురుచూస్తే... తమకు తీవ్ర నిరాశే కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు.
ఇక్కడే కాదు... చాలా జిల్లాల్లో ఈ సమస్య ఎదురవుతోంది. క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాల్సిన బ్యాంకుల అధికారులు... తమ అలసత్వంతో ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బును సకాలంలో అకౌంట్లలో క్రెడిట్ చెయ్యకుండా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలున్నాయి.
ఇవి కూడా చదవండి :
వీవీప్యాట్ల లెక్కింపు ప్రజల కోసమా... చంద్రబాబు కోసమా... వైసీపీ ఎందుకలా అంటోంది....
50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే... మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు...
ప్రేమించుకున్నారు... బ్రేకప్ అయ్యింది... ఆ తర్వాత ఆమెకు పోర్న్ ఫొటోలు పంపి...
లవర్ని ఏటీఎం కార్డులా వాడుకుని పరారైన ప్రియుడు.. కోపంతో ప్రియురాలు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019