హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP Mahanadu: రేపు టీడీపీ మహానాడు.. మేనిఫెస్టో విడుదల? అందులో ఏముందంటే? అభ్యర్థులను ప్రకటిస్తారా?

TDP Mahanadu: రేపు టీడీపీ మహానాడు.. మేనిఫెస్టో విడుదల? అందులో ఏముందంటే? అభ్యర్థులను ప్రకటిస్తారా?

నేటి నుంచి మహానాడు

నేటి నుంచి మహానాడు

TDP Mahanadu: వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలుగు దేశం పార్టీ.. అందుకు సమరసన్నాహంగా మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో జరగనున్న ఈ మహానాడు వేదికగా సంచలన నిర్ణయాలను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అలాగే మేనిఫెస్టోపైనా క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

TDP Mahanadu: 2024 ఎన్నికలను తెలుగు దేశం పార్టీ  (Telugu Desam Party) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఫిక్స్ అయ్యారు. అందుకే డూ ఆర్ డై తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికలకు సమర సన్నాహకంగా మహానాడు (Mahanadu) ను భావిస్తున్నారు. రేపటి నుంచి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ఈ టీడీపీ (TDP) మహానాడు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపించారు కూడా.  శని, ఆదివారాల్లో మహానాడును ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా తొలిరోజు ప్రతినిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ ప్రతినిధుల మహానాడును మే 27న జరుపుకోవటం టీడీపీ సంప్రదాయం.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి (మే 28) రోజు మహానాడు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. రాజమండ్రి మహానాడులో అన్ని అంశాలపై చర్చలు ఉంటాయని..రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక నిర్ణయాలపై చర్చ చేపడతామని పేర్కొన్నారు. మే 28న భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. కాగా.. ఈ సమావేశాలకు 15 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన డిజిటల్ సంతకంతో ఆహ్వానాలు పంపుతున్నారు. మరోవైపు మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో (Manifesto)ప్రాథమిక అంశాలు వెల్లడించనున్నారు చంద్రబాబు నాయుడు.

ఇదీ చదవండి : యువతకు నైపుణ్యం.. పేదలకు ఇళ్లు.. సుపరిపాలన.. అభివృద్ధి ఫార్ములా.. నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పబోయేది ఇదే..

ముఖ్యంగా మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చేలా తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో ఉండనుందని తెలుస్తోంది. అయితే మేనిఫెస్టోలో ముఖ్య అంశాలను మాత్రమే చెప్పనున్నారు. అలాగే దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. మహానాడులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే చంద్రబాబు, లోకేశ్ చేరుకోనున్నారు.  మొదట చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతోన్న వేళ ఈ సారి మరింత ప్రతిష్టాతక్మంగా మహానాడును నిర్వహిస్తున్నారు. దాదాపు 25 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఏపీకి సంబంధించిన 15, తెలంగాణకు సంబంధించిన 6 తీర్మానాలు ప్రవేశపెడతారు. నాలుగు ఉమ్మడి తీర్మానాలు ఉండనున్నాయని సమాచారం.

First published:

Tags: Andhra pradesh news, AP News, Chandrababu Naidu, Local News, TDP

ఉత్తమ కథలు