హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cyclone Alert: వరుణుడు ఆట, వేట మొదలైంది.. ముంచుకొస్తున్న గండం! ఈ జిల్లాలపై అధిక ప్రభావం

Cyclone Alert: వరుణుడు ఆట, వేట మొదలైంది.. ముంచుకొస్తున్న గండం! ఈ జిల్లాలపై అధిక ప్రభావం

తుపాను(file)

తుపాను(file)

గులాబ్ తుఫాన్ గండంతో వానదేవుడు తరుముకొస్తున్నాడు. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

(ఆనంద్ మోహన్‌ పూడిపెద్ది, విశాఖ రిపోర్టర్ న్యూస్‌-18 తెలుగు)

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించనున్నాడు. గులాబ్ తుఫాన్ గండంతో వానదేవుడు తరుముకొస్తున్నాడు. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది. అయితే రానున్న 24 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ముందుగా ఈ నెల 16 నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. ఇప్పుడు ఒకరోజు తర్వాత.. అంటే ఇవాళ్టి నుంచే వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది.. తుపాను ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈ జిల్లాలపై అధిక ప్రభావం:

ఇక, ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాలను కూడా వేసిండి వాతావరణశాఖ.. ఇవాళ, రేపు, ఎల్లుండు శ్రీకాకుళం, విశాఖపట్నం , అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదా­వరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం , కర్నూలు , కడప , తిరుపతి జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలు కుస్తారని పేర్కొంది. ఇదే సమయంలో. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఈ సమయంలో.. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు­గాలు­లు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి కొత్త రికార్డులు సృష్టించాయి. దీంతో ఈ వర్షాలు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తాయని కొందరు భావిస్తుండగా..అటు రైతులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సీజన్‌ కానీ సీజన్‌లో వర్షాలు ఇలా కురిస్తే తర్వాత ఎండ మండిపోతుందని కొంతమంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గినా తర్వాతి రోజు నుంచే భానుడు ప్రతాపం చూపిస్తాడని భయపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Cyclone, Cyclone alert, Rains, Vizag

ఉత్తమ కథలు