హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విశాఖ గ్యాస్ లీక్ బాధ్యులను వదలి పెట్టేది లేదు: సీఎం జగన్

విశాఖ గ్యాస్ లీక్ బాధ్యులను వదలి పెట్టేది లేదు: సీఎం జగన్

వైఎస్ జగన్

వైఎస్ జగన్

మృతులకు కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చామని.. అవసరమైతే వారికి గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలన్నారు సీఎం జగన్.

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ ఘటనప బాధ్యులను వదలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం జగన్ అన్నారు. నివేదికలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి వారైన విడిచిపెట్టబోమని తేల్చిచెప్పారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున పరిహారాన్ని విడుదల చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వేగంగా స్పందించారని.. రెండు గంటల్లోనే ప్రభావిత గ్రామాల నుంచి తరలించామని అధికారులను ఆయన ప్రశంసించారు. మృతులకు కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చామని.. అవసరమైతే వారికి గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలన్నారు సీఎం జగన్.

మన ప్రభుత్వం స్పందించినంత వేగంగా ఎక్కడా స్పందించి ఉండరు. బాధితులకు రూ.కోటి పరిహారం ప్రకటించడం కూడా ఎక్కడా జరగలేదు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా కమిటీలు వేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో మూడు కమిటీలు వచ్చి పరిశీలించాయి. కంపెనీని ప్రశ్నించాల్సిన అంశాలన్నీ తయారు చేసి వారం సమయం ఇస్తాం. కంపెనీ నుంచి కూడా పూర్తి వివరాలు తీసుకుని కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితులకు ప్రత్యేక హెల్త్‌ కార్డులు ఇవ్వాలని సూచించాం. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి సంబంధించి ఈ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వమే ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఘటనకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలిపెట్టేది లేదు.
వైఎస్ జగన్, ఏపీ సీఎం

మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇచ్చారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Vizag gas leak, Ys jagan

ఉత్తమ కథలు