పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపధ్యంలో ఈ విధానం ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షలతో పాటు సప్లిమెంటరీ పరీక్షలకు వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 11 పేపర్ల కుదింపు అంశం కేవలం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వచ్చే ఏడాది నుండి యథావిథిగా 11 పేపర్లు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. కేవలం విద్యార్థులకు ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
మరోవైపు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయినా... ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారం జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి ప్రతి సబ్జెక్టుకు ఒక్కో పేపర్తో మాత్రమే పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. క్రితం 11 పరీక్షల పేపర్లు ఉండగా ప్రస్తుతం 6 పేపర్లకు బోర్డ్ కుదించింది. జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్, జులై 11న సెకండ్ లాంగ్వేజ్, జులై 12న థర్డ్ లాంగ్వేజ్, జులై 13న గణితం, జులై 14 సామాన్య శాస్త్రం, జులై 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు జరగనున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.