news18-telugu
Updated: October 23, 2018, 3:32 PM IST
జీవీఎల్ నరసిింహారావు, బుద్దా వెంకన్న(Image: Facebook)
అగ్రిగోల్డ్ ఆస్తుల వివాదం బీజేపీ - టీడీపీ మధ్య మంటలు రాజేస్తోంది. హాయ్లాండ్పై మంత్రి లోకేష్ కన్ను పడిందని.. అందుకే ఆస్తుల అమ్మకం ఆలస్యం అవుతోందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దీనిపై లోకేష్తో బహిరంగచర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అయితే, జీవీఎల్ వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై అమిత్ షా కుమారుడు జై షా కన్ను పడిందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అందుకే అగ్రిగోల్డ్ ఆస్తులను కొనేందుకు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూపును అమిత్ షా భయపెట్టి పంపేశారని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు బీజేపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రంలో ద్రోహుల ముఠా సంచరిస్తోందంటూ భగ్గుమన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా నరేంద్ర మోదీ దేశాన్ని భ్రష్టుపట్టిస్తుంటే, జీవీఎల్ నరసింహారావు తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తూ రాష్ట్రాన్ని భష్టుపట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మండిపడ్డారు. జీవీఎల్ నరసింహారావు.. ఉత్తరప్రదేశ్లో రూ.200 కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు. జీవీఎల్ విసిరిన బహిరంగ సవాల్పై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ మీద ప్రజల్లో తీవ్రంగా కోపం ఉందని.. ఆ పార్టీ నేతలు భద్రత లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 23, 2018, 3:32 PM IST