తూర్పుగోదావరి జిల్లాలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాళ్లరేవు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని.. దాంతో అక్కడ నిల్వ చేసిన టపాసులు పేలి పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐతే దీపావళి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బాణాసంచా తయారు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.