హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ ఊరట..బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ ఊరట..బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంలో ఊరట

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంలో ఊరట

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మే నెలాఖరు నుండి రాజమండ్రి జైల్లో ఉన్న అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ కోసం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించగా కోర్టు విచారణ జరిపింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మే నెలాఖరు నుండి రాజమండ్రి జైల్లో ఉన్న అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ కోసం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. నేడు ఈ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.

Breaking News: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి.. ఆయన ఏం చెప్పారంటే..?

తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు  (MLC Ananthababu) నిందితునిగా ఉన్నారు. ఈ కేసులో అనంతబాబు  (MLC Ananthababu) మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటున్నారు. బెయిల్ కోసం అనంతబాబు  (MLC Ananthababu) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో  ఏపీ హైకోర్టు (Andhra Pradesh High court) లో రెగ్యులర్ బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై సెప్టెంబర్ 26న ఏపీ హైకోర్టు (Andhra Pradesh High court) లో జరిగిన విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) కు చుక్కెదురైంది. బెయిల్ పిటీషన్ ను కోర్టు  (Andhra Pradesh High court) కొట్టి వేసింది. ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు  (High Court) అనంతబాబు  (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి. దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Kurnool: కర్నూల్ కమీషనర్​పై రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్ మండిపాటు

డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు  (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  (Supreme Court) ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేస్తున్నట్లు గతంలో పేర్కొంది. ఈ మేరకు నేడు విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో అనంతబాబుకు భారీ ఊరట లభించింది.

ఎమ్మెల్సీ అనంతబాబు  (MLC Ananthababu) జైలులో ఉండగానే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. అనంతబాబు  (MLC Ananthababu) తల్లి మంగరత్నం ఆగష్టు నెలలో మృతి చెందారు. దీనితో అతనికి రాజమండ్రి ఎస్సి, ఎస్టీ కోర్టు ప్రత్యేక అవకాశం కల్పించింది. తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి 3 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మూడు రోజులు స్వగ్రామం ఎల్లవరం ధాటి బయటకు పోవద్దని అనంతబాబుకు  (MLC Ananthababu) కోర్టు తెలిపింది. ఇక ఇప్పుడు బెయిల్ రావడంతో అనంతబాబు జైలు నుండి బయటకు రానున్నారు.

First published:

Tags: Ap, AP News, Supreme Court

ఉత్తమ కథలు