వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొట్టేశారు. కేబినెట్ ర్యాంక్ స్థాయిలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా లాభాదాయక పదవిలో ఉన్నారని బీజేపీ నేత రామకోటయ్య ఫిర్యాదు చేశారు. లాభదాయక పదవులు కలిగి ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నారు. ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీతభత్యాలు తీసుకోనందున ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణించలేమని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
ప్రిపెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ వర్తించదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈసీ అభిప్రాయం మేరకు అనర్హత పిటిషన్ను కొట్టేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ అంశంలో ఈ అంశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట లభించినట్టయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Vijayasai reddy