వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటలకు పైగా అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా భాగంగా అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐకి పూర్తిగా సహకరించాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని అన్నారు. కొందరు దర్యాప్తును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని అవినాష్ (Mp Avinash Reddy) ఆరోపించారు. నా విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని సీబీఐని విజ్ఞప్తి చేశానని అవినాష్ తెలిపారు. వైఎస్ వివేకా హత్య తరువాత జరిగిన పరిణామాలపై అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది.
ఈనెల 23న మొదటిసారి అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల్లో జనవరి 24న విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే ఈ నోటిసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. నోటీసులు ఇచ్చి ఒక్క రోజులో రావాలంటే ఎలా? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి తెలిపాడు. 4 రోజుల పాటు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని, మరోసారి సీబీఐ నోటీసులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా అని అన్నాడు. ఇక ఎంపీ అవినాష్ విజ్ఞప్తి మేరకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ స్టార్ట్ చేయగా..ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్ పై నేడు సీబీఐ కోర్టు (CBI Court) విచారణ జరిపింది. ఈ క్రమంలో ఐదుగురు నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి, శివ శంకర్ రెడ్డిలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరంతా ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ వేసింది. ఇక దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇటీవల విచారణ జరిపింది. కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును త్వరితగతిన, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా తదుపరి దర్యాప్తు కొనసాగాలని కోర్టు సూచించింది.
ఈ కేసులో పెద్ద ఎత్తున నిందితులను విచారించాల్సి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ CBIకి పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరుగుతుందని మాత్రమే కాదు న్యాయం జరగాలని కోర్టు చెప్పింది. న్యాయం జరగాలనుకోవడం బాధితురాలి యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Ycp