హోమ్ /వార్తలు /andhra-pradesh /

NTR Barath Ratna: ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలి.. లోక్ సభలో ఎంపీ డిమాండ్

NTR Barath Ratna: ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలి.. లోక్ సభలో ఎంపీ డిమాండ్

NTR Barath Ratna: ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజాగా పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ అదే డిమాండ్ వినిపించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పచ్చ జెండాలు రెప రెపలాడాయి.

NTR Barath Ratna: ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజాగా పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ అదే డిమాండ్ వినిపించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పచ్చ జెండాలు రెప రెపలాడాయి.

NTR Barath Ratna: ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజాగా పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ అదే డిమాండ్ వినిపించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పచ్చ జెండాలు రెప రెపలాడాయి.

ఇంకా చదవండి ...

    NTR Barath Ratna: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పుట్టి 40 ఏళ్లు అయ్యింది. నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు అంబరాన్ని అంటుతూనే ఉన్నాయి. 40 వసంతాల వేడుకలను టీడీపీ (TDP) శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టీడీపీ నేత, లోక్ సభ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ (MP Galla Jaydev).. పార్ల‌మెంటులో టీడీపీ పేరుతో పాటు ఎన్టీఆర్ పేరును కూడా ప్ర‌స్తావించారు. ఆత్మగౌరవమే నినాదంగా, వెనుకబడిన వర్గాలకు అండగా, ప్రగతిశీల రాజకీయాలకు దర్పణంగా నిలవాలనే ఉద్దేశంతో స్థాపించిన పార్టీ తెలుగు దేశం అని జయదేవ్ గుర్తు చేశారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా.. ఇటు సినిమాల్లో అటు రాజ‌కీయాల్లో స‌త్తా చాటిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భార‌తర‌త్న ఇవ్వాలని చాలాకాలం నుంచి టీడీపీ డిమాండ్ ఉందని.. అదే డిమాండ్‌ను మ‌రోమారు లోక్ సభలో ప్ర‌స్తావించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా లోక్ స‌భ‌లో ఈ అంశాన్ని ప్ర‌స్తావించిన గ‌ల్లా జ‌య‌దేవ్‌.. ఎన్టీఆర్‌కు భార‌తర‌త్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే స‌మ‌యంలో టీడీపీ 40 వ‌సంతాల పండుగ జ‌రుపుకుంటున్న విష‌యాన్ని ఆయ‌న పార్ల‌మెంటు దృష్టికి తీసుకెళ్లారు.

    పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్థాపకులు, అన్నగారు ఎన్టీ రామారావుగారికి నివాళులు అర్పించామని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ కేంద్రం దగ్గర ఈ డిమాండ్ వినిపించారు. తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవాన్ని సంపాదించిపెట్టిన, ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సత్తాచాటిన ఎన్టీఆర్ కు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని.. ఇప్పటికే ఆలస్యమైంది అన్నారు.

    కేజీ 2 రూపాయలకే బియ్యం అందించి ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చారని, మద్యపాన నిషేధం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. భారతరత్నకు ఎన్టీఆర్ అన్ని విధాలా అర్హుడని గల్లా జయదేవ్ వెల్లడించారు. ఇటు మరో ఎంపీ రామ్మోహన్ రాయుడు సైతం.. ఆవిర్భావ దినోత్సవ సభలో ఎన్టీఆర్ ఘనతలను గుర్తు చేశారు. శ్రామికుడి కష్టం నుంచి, కార్మికుడు శ్ర‌మ‌కోర్చి కరిగించిన కండ‌రాల శ‌క్తి నుంచి, రైతుల స్వేదం నుంచి, నిరుపేదల ఆశ‌ల నుంచి, కష్టజీవుల ఆకాంక్ష‌ల నుంచి, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి పౌరుషం చాటి చెప్పటం కోసం పుట్టింది ఈ తెలుగుదేశం అని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    తెలుగు జాతి ఉన్నంతవరకు, పసుపు జెండా బలంగానే ఉంటుందన్నారు. తెలుగు ప్రజలకు, టీడీపీ నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతున్నాన‌ని పేర్కొంటూ.. చివ‌ర్లో జై తెలుగుదేశం అని నిన‌దిస్తూ త‌న సంక్షిప్త సందేశాన్ని ముగించారు.

    First published:

    ఉత్తమ కథలు