హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Ex Minister: ఫ్రస్ట్రేషన్లో మాజీ మంత్రి.. పదవి పోయాక అసహనం..! చిటపటలు.. చిందులే పని..

AP Ex Minister: ఫ్రస్ట్రేషన్లో మాజీ మంత్రి.. పదవి పోయాక అసహనం..! చిటపటలు.. చిందులే పని..

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్

Vizag: పోలీసు అధికారులపై.. మీడియాపై.. రెవెన్యూ ఉద్యోగులపై.. ఒకటేమి ఆ మాజీ మంత్రి అరవని వ్యక్తి లేడు. మొత్తం నియోజకవర్గంలో ఆయన అసహనాన్ని.. చికాకుని.. కోపాన్ని గంపగుత్తగా చూపించేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. మొన్నటి కేబినేట్ విస్తరణలో మంత్రి పదవి పోవడంతో.. తీవ్ర అసహనానికి లోనైనట్టు చెప్పుకుంటున్న ఆయన ఇప్పుడు ఎవర్ని పడితే వారిపై శివాలెత్తిపోతున్నారు.

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18, Visakhapatnam

గత నెలలో జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) లో కొందరికి పదవులు పోయాయి. మంత్రి పదవి లేకున్నా కొందరు నేతలు తమ పని తాము చేసుకుపోతుండగా.. కొంతమంది మాత్రం ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోతున్నారు. పోలీసు అధికారులపై.. మీడియాపై.. రెవెన్యూ ఉద్యోగులపై.. ఒకటేమి ఆ మాజీ మంత్రి అరవని వ్యక్తి లేడు. మొత్తం నియోజకవర్గంలో ఆయన అసహనాన్ని.. చికాకుని.. కోపాన్ని గంపగుత్తగా చూపించేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. మొన్నటి కేబినేట్ విస్తరణలో మంత్రి పదవి పోవడంతో.. తీవ్ర అసహనానికి లోనైనట్టు చెప్పుకుంటున్న ఆయన ఇప్పుడు ఎవర్ని పడితే వారిపై శివాలెత్తిపోతున్నారు. ఆఖరికి ప్రజా జీవితంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. చిందులేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాగా ఉన్న ఈ మహా జిల్లా ఇప్పుడు ఏడు నియోజకవర్గాల చిన్న నగరంగా మారిపోయింది. అటు భీమిలీ నుంచీ ఇటు గాజువాక వరకూ కలిపి మొత్తం ఏడు నియోజకవర్గాల మహా విశాఖగా ఉంది. అయితే భీమిలీ నియోజకవర్గం ఎమ్మెల్యే, మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురించే ఇప్పుడు చెప్పుకోవాలి.
కేబినేట్ పునర్వ్యవస్థఈకరణ తర్వాత.. ఆయన మంత్రి పదవి పోయింది. ఇక అప్పట్నించి ఎమ్మెల్యే అదో మాదిరిగా అయిపోయారని నియోజకవర్గం ప్రజానీకం మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆయన అనుచరులు కూడా బూతు పురాణం వింటున్నామని గగ్గోలు పెడుతున్నారు. రోజూ ఆయన తన ఫ్రస్ట్రేషన్ ను తమపై చూపిస్తున్నారని ఆయన అనుంగు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.

ఇది చదవండి: మేడం సార్.. మేడం అంతే..! ఆమె ముందు లేడీ విలన్లు కూడా బలాదూర్.. హడలిపోతున్న ఉద్యోగులు..


ఆయన దగ్గర ఇలాంటివి మామూలే అని కొట్టిపారేయొచ్చు. కానీ.. ఇటీవల భీమిలీ నియోజకవర్గం పద్మనాభం మండలంలో ఏకంగా మీడియాపైనే అవంతి ఎగిరారు. నీసంగతి చూస్తా అంటూ మీడియాను అన్న మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఎమ్మెల్యే.. అదీ ఒక ప్రజా సభలో ఇలా మాట్లాడటాన్ని అందరూ హవ్వా అనుకుంటున్నారు. ఈ వీడియోలోనే ఓ ఎస్సైని ఏం ఉద్యోగం చేస్తున్నావయ్యా అంటూ చిర్రుబుర్రులాడటం వైరల్ గా మారింది. ఎంత మంత్రి పదవి పోతే మాత్రం ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి నాయనా.. అంటూ ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్న పరిస్థితి నియోజకర్గంలో ఉంది.

ఇది చదవండి: మాకేంటీ చెత్తపని.. కలెక్టర్ తీరుపై అధికారుల అసంతృప్తి.. వీకెండ్ లోనూ చాకిరీ..!


భీమిలి ప‌రిధిలోని ప‌ద్మనాభం మండ‌లం కోరాడ‌లో రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా హాజ‌రైన అవంతి చేసిన హడావుడి ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. మీడియా ప్రతినిధుల‌తో పాటు పోలీసు సిబ్బందిపైనా అస‌హ‌నం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని ప‌ట్టుకుని ఏం ప‌ని చేస్తున్నావ‌య్యా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యక్రమాన్ని క‌వ‌ర్ చేసేందుకు వ‌చ్చిన ఓ మీడియా ప్రతినిధిని ఆయ‌న బెదిరించారు. తర్వాత దేవుడు పైన చూస్తున్నాడని అనడం ఏదో ముక్తాయింపనే చెప్పాలి. అవంతి శ్రీనివాస్ తన హుందాతనాన్ని విడిచి.. ఇలా నెట్టింట తిట్టించుకునే దాకా పరిస్థితి వచ్చిందంటే అది ఆయన తప్పు కాదంటారు టీడీపీ పక్షాలు. మంత్రి పదవి ఇలా అమాంతం పీకేస్తే ఇలా అయిపోరేంటని ఓ ఆటాడేసుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Avanthi srinivas

ఉత్తమ కథలు