హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Botsa Satyanarayana: ఏపీ కేబినెట్ ప్రక్షాళనపై బొత్స కీలక వ్యాఖ్యలు..ఎమ్మెల్సీ ఫలితాలను ప్రస్తావిస్తూ..

Botsa Satyanarayana: ఏపీ కేబినెట్ ప్రక్షాళనపై బొత్స కీలక వ్యాఖ్యలు..ఎమ్మెల్సీ ఫలితాలను ప్రస్తావిస్తూ..

బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana: ఏపీ కేబినెట్ ప్రక్షాళనపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Botsa Satyanarayana: ఏపీ కేబినెట్ ప్రక్షాళనపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పరిపాలనా సౌలభ్యం కోసం కేబినెట్ ఏర్పాటు ఉంటుంది. ఆ కేబినెట్ (Ap cabinet) లోకి ఎవరిని తీసుకోవాలనేది..సీఎం విచక్షణాధికారం, ఆయన ఇష్టమని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు, చేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చని అన్నారు. కేబినెట్ లో మార్పులు జరుగుతాయన్న ఊహాగానాలకు తనలాంటి మంత్రి స్పందించడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు, కేబినెట్ ప్రక్షాళనకు ఏం సంబంధం అని ..ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే అందులో తప్పేముందని బొత్స  (Botsa Satyanarayana)  వ్యాఖ్యానించారు.

ఉత్తరాంద్ర ఎమ్మెల్సీ ఓటమిపై బొత్స రియాక్షన్..

ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓటమిపై బొత్స  (Botsa Satyanarayana) స్పందించారు. ఓటమికి మా వైఫల్యమే కారణం. ఓటమికి బాధ్యత వహిస్తాను. ఈ ఎన్నికల్లో లోపం ఎక్కడుందో సమీక్షించుకుంటాం అని అన్నారు. ఓటమిని వేరే రాజకీయ నాయకులపై నెట్టేయడం నా జీవితంలో చేయలేదు. అలా అని తప్పించుకు పారిపోయే వ్యక్తిని కాదన్నారు. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం. విశాఖ కేంద్రంగా పరిపాలన జరగాలన్నదే మా అభిప్రాయం అని బొత్స సత్యనారాయణ  (Botsa Satyanarayana) తేల్చి చెప్పారు.

ఇక ఏపీలో డిసెంబర్  లోనే ఎన్నికలు జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం తమకు లేదని..ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతారని అన్నారు. మరి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నాయకులూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే..ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న కేబినెట్ గత కేబినెట్ కంటే వీక్ గా ఉందని..ప్రతిపక్షాల విమర్శలకు స్పందించే సరైన వారు లేరని తెలుస్తుంది. దీనితో కేబినెట్ లో నలుగురికి కొత్తగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

YCP Vs TDP: పుట్టపర్తిలో టెన్షన్..టెన్షన్..వైసీపీ, టీడీపీ బాహాబాహీ

ఇక త్వరలోనే మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) ఉంటుందని వైసీపీ (YCP) వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే ముగ్గురుని కేబినెట్ నుంచి తప్పించి.. మరో ముగ్గురికి అవకాశం ఇస్తారని వైసీపీ వర్గాల్లో టాక్..  అయితే తప్పించే మంత్రుల జాబితాలో సీదిరి అప్పలరాజు కూడా ఉన్నారని ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన పట్ట భద్రుల ఎన్నికల్లో (Graduate MLC Elections) ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఓడింది. దీనికి తోడు సీదిరిపై సొంత పార్టీకి చెందిన నేతలు, సొంత సామాజిక వర్గ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వున్న కేబినెట్ లో మరో ముగ్గురికి ఉధ్వాసన తప్పేలా లేదు.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Botsa satyanarayana

ఉత్తమ కథలు