హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మార్పుపై పవన్ రియాక్షన్ ఇదే..

Ap: కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మార్పుపై పవన్ రియాక్షన్ ఇదే..

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్న సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) స్పందించారు. కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్న గౌరవిస్తా. కన్నా ప్రస్తుతం బీజేపీలో ఉన్నందున ఏమి మాట్లాడలేనని పవన్  (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

కొండగట్టు అంజన్న సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) స్పందించారు. కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్న గౌరవిస్తా. కన్నా ప్రస్తుతం బీజేపీలో ఉన్నందున ఏమి మాట్లాడలేనని పవన్  (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.

Breaking News: లోకేష్ పాదయాత్రకు అనుమతి.. షరుతులు వర్తిస్తాయి.. ఆంక్షలు ఇవే

కారణం అదే?

కాగా కన్నా జనసేనలో చేరబోతున్నారనే ప్రచారానికి కారణం లేకపోలేదు. గత నెల జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కన్నాను ఆయన ఇంటికి వెళ్లి కలవడంతో.. జనసేనలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కూడా తాను బీజేపీలో ఉంటానని ప్రకటించిన కన్నా..సోము వీర్రాజును టార్గెట్ చేయడం మాత్రం ఆపలేదు. ఆయన వల్లే ఏపీలో పార్టీ ఎదగడం లేదన్నట్టుగా విమర్శలు గుప్పించారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు దాదాపుగా సిద్ధమయ్యారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న జనసేన .. తమ పార్టీ తరపున పోటీలో ఉండేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. టీడీపీ , జనసేన కూటమితో పోటీ చేసే అవకాశం ఉండడంతో ఇక పార్టీ మారడమే మంచిదనే భావనకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana).. తనకు కేటాయించబోయే సీటు గురించి కూడా ముందుగానే స్పష్టత తీసుకున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చిందని.. దీంతో కన్నా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై చాలా కాలం నుంచి అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana).. వీలు దొరికినప్పుడల్లా ఆయనపై అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక నేడు భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికలు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ భేటీకి కన్నా దూరంగా ఉన్నారని తెలుస్తుంది.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Bjp, Kanna Lakshmi Narayana, Pawan kalyan

ఉత్తమ కథలు