హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: మిస్టరీ మరణాలపై స్పందించిన సీఎం.. మంత్రులకు కీలక ఆదేశాలు.. అసెంబ్లీలో రచ్చ షురూ..!

YS Jagan: మిస్టరీ మరణాలపై స్పందించిన సీఎం.. మంత్రులకు కీలక ఆదేశాలు.. అసెంబ్లీలో రచ్చ షురూ..!


ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా  ఐటీఐ విద్యార్ధులకు   10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు  15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు నేర్చుకునే వారికి  20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాల (Jangareddygudem Mystery Deaths) చుట్టూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు తిరుగుతున్నాయి. అసెంబ్లీ (AP Assembly 2022) లో టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ (CM YS Jagan) మంత్రులు ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలిచ్చారు.

ఇంకా చదవండి ...

జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాల (Jangareddygudem Mystery Deaths) చుట్టూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు తిరుగుతున్నాయి. అసెంబ్లీ (AP Assembly 2022) లో టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, నారాయణ స్వామితో భేటీ అయిన సీఎం జగన్.. వారికి కీలక ఆదేశాలిచ్చారు. ముగ్గురు మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన సీఎం.. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రచారాన్ని అసెంబ్లీలోనూ, బయట గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. మంత్రుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్న సీఎం.. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని నిర్ణయించారు. మిస్టరీ మరణాలపై పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఆరోపణలకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీ లోపల బయట మంత్రులు ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో స్పీకర్‌ పట్ల టీడీపీ అనుచితంగా ప్రవర్తించిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు., వాస్తవాలు ప్రజలకు తెలియకుండా రాద్ధాంతం చేశారని నిప్పులు చెరిగారు. ర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న బొత్స..,సభలో గొడవ చేస్తున్నారని ఆరోపించారు. చివరకు స్పీకర్‌ పోడియం వద్దకు కూడా దూసుకు వస్తున్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై అసత్య ప్రచారం చేస్తూ బురద చల్లుతున్నారని.,. దాన్ని పట్టుకుని టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని బొత్స ఆరోపించారు.

ఇది చదవండి: ఆ జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే.. మరొకరు హర్ట్ అవుతారు.. జగన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

సభలో టీడీపీ పక్కా ప్లాన్ ప్లకారం డ్రామాలు ఆడుతోందని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు నిర్దేశం మేరకే సభలో టీడీపీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభలో గొడవ చేసి, సస్పెన్షన్‌కు గురై, బయటకు వచ్చి విమర్శలు చేసి, జంగారెడ్డిగూడెం పోవాలని టీడీపీ సభ్యులు వ్యూహం పన్నారని అప్పలరాజు విమర్సించారు.

ఇది చదవండి: త్వరలో జగనన్న ఓటీటీ..? విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

ఇక సభలోనూ వైసీపీ సభ్యులు, మంత్రులు టీడీపీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలను వేధించడంలో వారిపై లైంగిక వేధింపులు చేయడంలో నెంబర్ వన్ గా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపారన్నారని ఆమె గుర్తుచేశారు.

ఇది చదవండి: పంజాబ్ లో ఆప్ విజయం.. ఏపీలో తెలుగు తమ్ముళ్ల జోష్.. కారణం ఆయనేనా..!

చంద్రబాబు అధికారంలో ఉంటే మద్యపానానికి అనుకూలంగా మీడియాలో వార్తలు రాయిస్తున్నారని.., చంద్రబాబు అధికారంలో లేకుండా ఉంటే మద్యపాన నిషేధానికి అనుకూలంగా కథనాలు రాయిస్తారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో మృతి చెందిన వారి కుటుంబాలు ఎక్కడా నాటుసారా గురించి మాట్లాడలేదని.. శ్మశానంలో శవాల లిస్ట్ తీసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మద్యపానం కారణంగా నమోదైన ప్రతిమరణానికి చంద్రబాబే కారణమన్న నాని.. రాష్ట్రంలో బెల్టుషాపులు తొలించిన వ్యక్తి జగన్ అని గుర్తుచేశారు.

ఇది చదవండి: జనసేన సభ కొత్త పొత్తులకు వేదిక కానుందా..? పవన్ ప్రకటనపై సస్పెన్స్.. ఆ నేత ఆశలు ఫలిస్తాయా..?

మరోవైపు టీడీపీ మాత్రం సభలో ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. జంగారెడ్డిగూడెం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందంటూ అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసిన టీడీపీ సభ్యులు.. మద్యపానంపై మాట తప్పిన సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, AP Budget 2022, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు