అమరావతిలో రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని గ్రామాల్లో రైతులు మూడువారాలుగా నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమరావతి రైతుల్ని చర్చలకు ఆహ్వానించారు ఏపీ మంత్రి కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి అమరావతి ప్రాంత రైతులు మోసపోవద్దన్నారు. లక్ష కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మించే బదులు... అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను కొంతమేర అభివృద్ధి చేస్తే ఢిల్లీ, హైదరాబాద్ నగరాలతో పోటీ పడుతుందని ఆయన తెలిపారు. అమరావతి రైతులు చర్చకు రావాలని ఆహ్వానించారు. తమ డిమాండ్లను అమరావతి రైతులు వివరిస్తే... న్యాయం చేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. సరైన అవగాహన, డిమాండ్లతో వస్తే ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని కాదని ఎవరన్నారని ప్రశ్నించారు కొడాలి నాని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Amaravati, Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kodali Nani