హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: 26న జనసేనలోకి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.. అక్కడి నుంచి పోటీ ?

AP Politics: 26న జనసేనలోకి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.. అక్కడి నుంచి పోటీ ?

కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్ ఫోటో)

కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్ ఫోటో)

Kanna Lakshmi Narayana: ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో నేతలు కూడా పార్టీలు మారే విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi Narayana) జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 26న ఆయన అధికారికంగా జనసేన పార్టీలో చేరబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి(SattenaPalli) నుంచి పోటీ చేసేందుకు జనసేన (Janasena) నాయకత్వం అంగీకరించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై చాలాకాలం నుంచి అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. వీలు దొరికినప్పుడల్లా ఆయనపై అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు.

అయితే గత నెల జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కన్నాను ఆయన ఇంటికి వెళ్లి కలవడంతో.. కన్నా జనసేనలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కూడా తాను బీజేపీలో ఉంటానని ప్రకటించిన కన్నా.. సోము వీర్రాజును టార్గెట్ చేయడం మాత్రం ఆపలేదు. ఆయన వల్లే ఏపీలో పార్టీ ఎదగడం లేదన్నట్టుగా విమర్శలు గుప్పించారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు దాదాపుగా సిద్ధమయ్యారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న జనసేన.. తమ పార్టీ తరపున పోటీలో ఉండేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. టీడీపీ , జనసేన కూటమిలో బీజేపీ ఉండే అవకాశం లేకపోవడంతో.. ఇక పార్టీ మారడమే మంచిదనే భావనకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. తనకు కేటాయించబోయే సీటు గురించి కూడా ముందుగానే స్పష్టత తీసుకున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చిందని.. దీంతో కన్నా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

Big News: జీవో నెంబర్ 1..ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా

Breaking News: నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రకు లైన్ క్లియర్

సత్తెనపల్లి నుంచి ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించడంలో అంబటి రాంబాబు కూడా ముందు వరుసలో ఉంటారు. అందుకే ఆయనను ఓడించాలని పట్టుదలగా ఉన్న జనసేన.. ఇందుకోసం బలమైన అభ్యర్థిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Kanna Lakshmi Narayana

ఉత్తమ కథలు