CM YS Jagan on Polavaram Project: అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంచలన ప్రకటన చేశారు. ఏపీ ప్రజల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) విషయంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naiu) మానవ తప్పిదం చేశారని జగన్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం సంచలన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే.. ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని.. కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల కారణంగా ప్రాజెక్టు చాలా ఆలస్యం అవుతోంది అన్నారు. అలాగే ప్రాజెక్టుపై నెలకొన్న అనేక అనుమానాలకు ఆయన సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారన్నారు. అసలు ఈ పని పూర్తి చేశానని చెప్పుకోడానికి చంద్రబాబుకు ఒక్కటీ లేదని ఆరోపించారు. అందుకే ఇప్పుడు పోలవరం పూర్తవుతోందంటే ప్రతిపక్ష నేతకు కడుపుమంటగా ఉందన్నారు. విజన్ ఉంది అని చెప్పుకునే చంద్రబాబుకి.. అసలు ప్లానింగ్ లేదని మండిపడ్డారు. పోలవరం ఇప్పటి పోలవరం ఇప్పటి వరకు పూర్తి కాలేదు అంటే.. చంద్రబాబు చేసిన పనులే శాపంగా మారాయన్నారు. స్పిల్వే కట్టడంలో బాబుది అతిపెద్ద మానవ తప్పిదం అంటూ విమర్శించారు. అసలు స్పిల్వే పూర్తిచేయకుండానే కాఫర్డ్యామ్స్ కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పిల్వే పూర్తిచేయలేదు, కాఫర్డ్యామ్ మధ్యలోనే ఆపేశారని ఆరోపించారు.
విపక్షాలు, మీడియా ప్రచారం చేస్తున్నట్టు పోలవరం ఎత్తు ఒక్క ఇంచ్ కూడా తగ్గదని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నామనే కడుపు మంటతోనే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వల్లే పోలవరానికి ఈ గతి పట్టిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడా తగ్గడం లేదని.. చంద్రబాబు బుద్ధి విషయంలోనే ఎత్తు తగ్గుతున్నారంటూ జగన్ ఎద్దెవా చేశారు. చంద్రబాబు హయాంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగియాని ఆరోపించారు. అన్ని విషయాల్లో అవకతవకలు చేసి.. రాష్ట్రానికి అన్యాయం చేయడంతోనే.. 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు.
దివంగత మహానేత వైఎస్సార్ కొడుకుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను- సీఎం వైయస్ జగన్#APAssembly #CMYSJagan pic.twitter.com/yMW8P19hah
— YSR Congress Party (@YSRCParty) March 22, 2022
ఏపీకి తప్పక రావాల్సిన ప్రత్యేక హోదాను తాకుట్టుపెట్టి.. పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారన్నారు. అలాగే ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారంటూ ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని స్పష్టంచేశారు. 2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటన చేశారు.
ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని.. కేంద్రం సహకారంతో ఆర్అండ్ఆర్ పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్కు (వైఎస్ రాజశేఖర్ రెడ్డికి) అంకితం చేస్తామని సీఎం సభలో ప్రటకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేసి తీరుతానని సీఎం వైఎస్ జగన్ సభలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Polavaram