హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore YCP: నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్ గా అదాల ప్రభాకర్ రెడ్డి?

Nellore YCP: నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్ గా అదాల ప్రభాకర్ రెడ్డి?

నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి?

నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి?

నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీ నుంచి తాడేపలికి చేరుకోగా మరికాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం ఇంఛార్జి ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే వైసిపి రీజనల్ కోఆర్డినెటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కాకాణితో భేటీ అయ్యారు. ఇక తాజాగా మరోసారి వారితో భేటీ కానున్నారని తెలుస్తుంది. కాగా గత కొన్నిరోజులుగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీ నుంచి తాడేపలికి చేరుకోగా మరికాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం ఇంఛార్జి ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే వైసిపి రీజనల్ కోఆర్డినెటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కాకాణితో భేటీ అయ్యారు. ఇక తాజాగా మరోసారి వారితో భేటీ కానున్నారని తెలుస్తుంది. కాగా గత కొన్నిరోజులుగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే.

YS Jagan-Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు.. కోటంరెడ్డి తరువాత మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అలజడి రేపుతున్నాయి. ఓ వైపు కోటంరెడ్డి, మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ కూడా పార్టీ నాయకత్వం, పని తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఒకరి తరువాత మరొకరు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈ ఇద్దరి నాయకుల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇంఛార్జి బాధ్యతలను ఆదాలకు అప్పగించాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.

Kadapa: ఈ ఆకుపై కూర్చున్న మునగదు.. దీని స్పెషల్ ఇదే..!

కోటంరెడ్డికి చెక్..ఇంఛార్జ్ బాధ్యతలు ఆదాల చేతికి?

నా ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే వైసీపీపై విమర్శలు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇక తాజాగా ఆయనకు  సంబంధించి ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో 'నేను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తాను. ఇక తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని..వాటిని బయటపెడితే ఐపీఎస్ ఆఫీసర్ల ఉద్యోగాలు పోతాయి. దీనిపై కేంద్రం నుంచి  జరుగుతుందని' ఉంది. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో కోమటిరెడ్డికి అధిష్టానం చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. నెల్లూరు రూరల్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

అదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్నాడు. దీనితో కోటంరెడ్డిని ఎదుర్కొనే వ్యక్తి ఆదాల అని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రేసులో అనిల్, ఆనం, విజయ్ కుమార్ ఉండగా..ఆదాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Kotamreddy sridhar reddy, Ycp

ఉత్తమ కథలు