ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కళాకారులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి రోజా (Minister Roja). ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర క్రీడలు, సాంస్కృతి శాఖ మంత్రిగా తనదైన ముద్రవేసేందుకు యత్నిస్తున్న రోజా.. కళాకారులకు శుభవార్త చెప్పారు. గురువారం సచివాలయంలో సాంస్కృతిక శాఖపై సమీక్ష నిర్వహించిన ఆమె అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. దేశానికి సంస్కృతిని నేర్పించిన రాష్ట్రం ఆంద్రానే అని.., సంస్కృతి సాంప్రదాయాలకు మన రాష్ట్రం పుట్టినిల్లు అని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో నిష్ట్నాతులైన కళాకారులని గుర్తిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారికంగా సాంస్కృతిక పోటీలను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని గెలుపొందిన జట్లకు సీఎం జగన్ చేతుల మీదుగా అవార్డులు అందిస్తామని మంత్రి రోజా తెలిపారు.
జిల్లాల వారీగా కళాకారుల గుర్తింపు మరియు స్థానిక కళాకారుల సహాయంతో జరగాలనీ, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. కళాకారులకు ఐడి కార్డుల జారీకి వార్డు & గ్రామ సచివాలయాల సేవలను వినియోగించుకావాలనన్నారు. భవిష్యత్ తరాలకు సేవ చేయడానికి తెలుగు కళారూపాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలనీ, ఏపీ ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలు తప్పనిసరిగా భాగం కావాలని మంత్రి అధికారులని ఆదేశించారు.
ఈ సమావేశంలో మరికొన్ని మంత్రి రోజా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాలను తీసుకున్నారు. ప్రస్తుత ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ చెల్లింపులను పరిశీలించడం, జిల్లాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం, అన్ని జిల్లాల్లోని ఆడిటోరియంల గుర్తింపు, అన్ని కళారూపాల ఛాయాచిత్రాల ఏర్పాటు, జిల్లాల వారీగా అన్ని కళారూపాలను గుర్తించి జాబితా చేయడం, జిల్లా సాంస్కృతిక మండలి కమిటీని పునర్నిర్మించడం, అర్హులైన కళాకారులందరికీ అవసరమైన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని నిర్ధారించుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియంలను అందించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు లేఖలు పంపడం, శిల్పారామం, దేవాలయాలు మరియు ఇతర ప్రభుత్వ భవనాల వనరులను (ఆడిటోరియంలు) సాంస్కృతిక కార్యక్రమాల కోసం (వాటి కార్యకలాపాలకు భంగం కలిగించకుండా) వినియోగించుకోవడం, ఈ కార్యక్రమంలో చైర్మన్/ఛైర్పర్సన్లందరూ క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. సమీక్ష సమావేశంలో సాంస్కృతిక చైర్మన్ లు, డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఐఏఎస్, సీఈఓ కల్చరల్ శ్రీ మల్లికార్జున, ఐఏఎస్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Minister Roja