హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

థాంక్స్ పవన్ కల్యాణ్... ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ ట్వీట్

థాంక్స్ పవన్ కల్యాణ్... ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ ట్వీట్

ఐవైఆర్ కృష్ణారావు, పవన్ కల్యాణ్

ఐవైఆర్ కృష్ణారావు, పవన్ కల్యాణ్

తిరుమల శ్రీవారి స్థిరాస్తులను వేలం వేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న 28 ఆస్తులు విక్రయించేందుకు ఇప్పటికే రెండు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.

టీటీడీ ఆస్తుల వేలంపై ఏపీలో దుమారం రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టుతున్నారు. తాజాగా ఆ లిస్టులో టీటీడీ మాజీ ఈవో, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు చేరారు. టీటీడీ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు పునరావాస కేంద్రంగా మారిపోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశమంతా స్థిరాస్తి రంగం కోలుకోలేని పరిస్థితితో ఉంటే ఆస్తులను విక్రయానికి పెడతారా? అని మండిపడ్డారు. సదావర్తి భూముల అమ్మకంపై అప్పట్లో వైసీపీ హడావిడి చేసిందని.. మరి మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దాతలు ఇచ్చేటప్పుడు తీసుకుని ఇప్పుడు అమ్మేస్తామంటే సరైన పద్ధతేనా అని విమర్శలు గుప్పించారు. టీటీడీ బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని.. భక్తిభావం ఉన్నవారిని సభ్యులుగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేయాలని ఐవైఆర్‌ సూచించారు. ఇక ఈ సమస్యపై గళం విప్పిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు ఐవైఆర్

ముఖ్యమైన సమస్యపై మీరు గళం విప్పినందుకు కృతజ్ఞతలు పవన్ కల్యాణ్ గారు. ప్రభుత్వం మంచి పద్ధతులు పాటించి మంచి ఉదాహరణగా నిలవాలి. టీటీడీ రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు పునరావాస కేంద్రంగా మారిన నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇంతకంటే గొప్ప వాటిని ఊహించలేం.
ఐవైఆర్ కృష్ణారావు


తిరుమల శ్రీవారి స్థిరాస్తులను వేలం వేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న 28 ఆస్తులు విక్రయించేందుకు ఇప్పటికే రెండు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. దీనిపై మే 28న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan, Tirumala news, Tirumala Temple, Ttd

ఉత్తమ కథలు