MLA RK Roja Comments: తిరుపతి (Tirupati)లో అమరావతి(Amaravati) రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే రోజా (MLA Roja) షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఆ సభలో సీఎం జగన్ తీరుపై విపక్ష నేతలంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా బీజేపీ నేతలు, రెబల్ ఎంపీ రఘురామ రాజు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సదర్భంగా అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి (Capital Amaravathi) మద్దతిచ్చిన సీఎం జగన్ (AP CM YS Jagan) మడమతిప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) విమర్శించారు. తిరుపతి లో జరిగిన అమరావతి రైతుల సభలో పాల్గొన్న ఆయన.. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అమరావతి రైతులు న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో పాదయాత్ర చేశారని.., అమారావతి రైతులను ఆశీర్వదించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి కోసం 180 మంది మృతి చెందారని.., 2500 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. విపక్ష నేతలకు ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.
శుక్రవారం జరిగిన రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన సభ క్యాపిటల్ కోసం కాదని క్యాపిటలిస్టుల కోసం అంటూ ఆమె మండిపడ్డారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించుకున్న సభ అది అంటూ ఏద్దేవా చేశారు ఎమ్మెల్యే రోజా. విపక్ష నేతలు కూడా పాల్గొన్న ఆ సభను రాజధాని రైతులది అనడం కంటే..?క్యాపిటల్ కోసం కాదు క్యాప్టలిస్టులు చేసిన సభ అంటూ ఎద్దేవ చేశారు.
ఇదీ చదవండి: తిరుమలలో ఆ సేవ టికెట్ల ధర కోటిన్నర..? ఎందుకు అంత డిమాండ్..?
ఇప్పటివరకు ముసుగులు ధరించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విషం కక్కిన వాళ్ళు ఇప్పుడు ఒక చోట చేరారన్నారు. ఇంతకాలం బయట ప్రజలకు తెలియకుండా సీక్రెట్ గా సమావేశాలు ఏర్పాటు చేసుకుని సీఎం జగన్ ను టార్గెట్ చేసిన వారంతా.. ఇప్పుడు ఒకే చోట చేరి వారి మాస్క్ లు బయటకు తీశారన్నారు. అంతా కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక రాష్ట్రాన్ని నాశనం చేయాలను కుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఏపీలో స్కూళ్లకు సెలవులు ఖరారు.. డిసెంబర్ 23, జనవరి 10 నుంచి హాలిడేస్
రాష్ట్రంలో ఉన్న29 గ్రామాల గురించే మాట్లాడుతున్నారు తప్ప 13 జిల్లాల గురించి మాట్లాడని నేతలు రాయలసీమ, ఉత్తరాంధ్రకు మోసం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలుకు రెండో రాజధాని, హైకోర్టు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు చంద్రబాబు పక్కన కూర్చొని అమరావతికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు. రాయలసీమకు అన్యాయం చేయడంలో ముందు ఉన్న చంద్రబాబు, సిపిఐ నారాయణలను రాయలసీమ ప్రజలు నిలదీయాలని రోజా ఆరోపించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, MLA Roja, Mla roja trolls, Nagari MLA Roja