YCP Stretagy: 175 కి 175 సీట్లు సాధించడమే తన లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan Reddy) .. ఆ దిశగా నేతలను.. కేడర్ ను సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ.. గెలుపు గుర్రాలను రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న కొందరు ఎంపీలకు స్థాన చలనం తప్పదా? MPలలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుగా బరిలో దిగుతారా? మరికొందరికి ఉద్వాసన తప్పదా? సీట్లు కదులుతున్నాయా? అసలు జగన్ న్యూ స్ట్రాటజీ ఏంటి.. మరోవైపు క్షేత్రస్థాయిలో 360 డిగ్రీల సర్వేలు నిర్వహిస్తున్నారు అధినేత. ఇప్పటికే ఐప్యాక్ టీమ్ (I Pac Team)లు నియోజకవర్గాలను జల్లెడ పడుతున్నాయి. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. సీనియర్ వైసీపీ నాయకుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి.. ఫీడ్ బ్యాక్ ను అధినేత జగన్ కు అందిస్తున్నాయి. అలాగే నిఘా వర్గాల నుంచీ ఎప్పటికప్పుడు సమాచారం అధిష్ఠానానికి చేరుతోంది. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం విషయంలో సీఎం జగన్ చాలా నిక్కచ్చిగా ఉన్నారు. గడప దాటని వారు ఎంత సీనియర్లు అయినా.. సమావేశాల్లో వారికి నేరుగా.. సూటిగా సుత్తిలేకుండా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ ఎంపీల విషయంలో సరికొత్త ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాష్టంలోని 25 లోక్సభ సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీ 22 గెలుచుకుంది. శ్రీకాకుళం, గుంటూరు , విజయవాడ సీట్లను మాత్రమే టీడీపీ (TDP) సొంతం చేసుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం.. వైసీపీ (YCP) లోక్సభ సభ్యుల్లో సగం మందికి వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీ టికెట్స్ రాబోవన్నది ప్రస్తుత సమాచారం. వాస్తవానికి ఒకసారి ఎంపీ అయినవాళ్లు.. మళ్లీ మళ్లీ అదే సీటు నుంచి పోటీ చేసి సుదీర్ఘకాలం లోక్సభ సభ్యులుగా కాలం వెళ్లదీస్తారనే వాదన ఉండేది.
వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఎంపీ అభ్యర్ధి పనితీరు.. సమర్థత అసెంబ్లీ సీట్లపై ప్రభావం చూపుతుంది. ఆ లెక్కలు కూడా మార్పులు చేర్పులకు ఆస్కారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఎంపీలకు ఉద్వాసన పలికితే.. మరికొందరికి స్థాన చలనం ఉంటుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోచోటు నుంచి లోక్సభకు పోటీ చేయొచ్చని.. లేదా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉంటారని టాక్.
ఇదీ చదవండి : పవన్ పయనం ఎటు.. మోదీతో వెళ్తారా.. చంద్రబాబుతో జత కడతారా..?
అందుకే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా లెక్కలు దగ్గర పెట్టుకుని ప్లస్సులు.. మైనస్సులు వేస్తున్నారట. గత రెండు ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గాలపై గట్టిగా ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ఈ మార్పులు చేర్పులు గురించి తెలిసిన తర్వాత ఏ ఎంపీ ఎక్కడికి వెళ్తారు? మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా లేదా? ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయాలంటే వారికి అనువైన సెగ్మెంట్ ఏంటి? అని ఆరాలు తీస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలకు వైసీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు వెళ్లాయని.. ఆ మేరకు నిర్దేశించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు పనులు చేసుకుంటున్నారని సమాచారం.
ఇదీ చదవండి : టీచ్ ఫర్ ఛేంజ్ పేరుతో స్మార్ట్ క్లాస్ లు.. మంచు లక్ష్మిని చూసేందుకు ఎగబడ్డ జనం
ఆ జాబితా ఇదే..
విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ పేరు కూడా ఆ జాబితాలో ఉంది. విశాఖ తూర్పులో టీడీపీ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబుపై వచ్చే ఎన్నికల్లో MVV వైసీపీ నుంచి పోటీ చేస్తారని టాక్. MVV అయితే బలమైన ప్రత్యర్థిగా మారతారని భావిస్తోందట. అందుకే తూర్పుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఎంపీకి చెప్పేశారట. పిఠాపురం అసెంబ్లీ బరిలో వంగా గీత..?
గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచిన వంగా గీతను సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని చెబుతున్నారు. గతంలో పీఆర్పీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఆమె కూడా అసెంబ్లీకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ముద్రగడ పద్మనాభం జాయినింగ్ను బట్టి పిఠాపురం సీటుపై వైసీపీ మరింత క్లారిటీ ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. సర్వేలో దొరబాబుకు మార్కులు పడలేదో ఏమో.. వంగా గీత మాత్రం పిఠాపురంలో వేగంగానే పావులు కదుపుతున్నారట.
ఇదీ చదవండి : ఫలితాలు ఇస్తున్న విఐపి బ్రేక్ దర్శనంలో మార్పులు.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ
అమలాపురం ఎంపీ చింతా అనురాధ సైతం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటారట. అమలాపురం లేదా పి.గన్నవరం నుంచి అనురాధను పోటీ చేయించొచ్చని తెలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు తర్వాత అమలాపురంలో జరిగిన అల్లర్లు.. తర్వాత మారిన సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్. ఇప్పటికే రాజమండ్రి అర్బన్లో అనేక ప్రయోగాలు చేసింది వైసీపీ అధిష్ఠానం. అవేమీ వర్కవుట్ కాకపోవడంతో భరత్ను బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయులకు వైసీపీ అధిష్ఠానం కొత్త సూచన చేసిందట. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గుంటూరు ఎంపీగా పోటీ చేయించే వీలుందట. అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ పెద్దలు MPకి చెప్పినట్టు సమాచారం.
ఇదీ చదవండి : నేడు.. రేపు ప్రత్యేక పూజలు.. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చల్లో నలిగిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. అక్కడ కురుబ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటడంతో.. అదే సామాజికవర్గానికి చెందిన మాధవ్కు కలిసి వస్తుందని అనుకుంటున్నారట. అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. ఆయన కల్యాణదుర్గంపై కన్నేశారట. తన సామాజికవర్గానికి చెందిన బోయ కులస్తులు ఎక్కువగా ఉండటంతో కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు రంగయ్య. అయితే కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఉషాశ్రీచరణ్ ప్రస్తుతం మంత్రి. ఆమెను కాదని రంగయ్యకు సీటు ఇస్తారా అనేది ప్రశ్న. ఒకవేళ కల్యాణదుర్గం కాకపోతే గుంతకల్లు నుంచి రంగయ్య బరిలో ఉండొచ్చనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్రెడ్డిని రాజ్యసభ లేదా.. నెల్లూరు నగరం, కావలిలో ఒకచోట అసెంబ్లీ టికెట్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. మిగతా ఎంపీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ycp