ANDHRA PRADESH POLITICAL NEWS CM JAGAN MOHAN REDDY REACHED DELHI WILL MEET PM MODI AT EVENING NGS
Cm Jagan-Delhi: ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ.. ముందస్తుపై క్లారిటీ వచ్చేనా..?
ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్
Cm Jagan-Delhi: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర హామీలపై ప్రధానికి మరోసారి సాయంత్రం ప్రధాని మోదీతో భేటీతో చర్చించనున్నారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
AP CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ (Delhi) చేరుకున్నారు. ఉదయం 10.50 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ (Gannavaram airport) నుంచి ఢిల్లీకి బయలు దేరిన ఆయన.. కాసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే పార్టీ నేతలతో కలిసి ఆయన మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. తరువాత కాసేపు విరామం తీసుకుని.. ప్రధాని మోదీ (Pm MOdi)తో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు నిధులు, జల వివాదాలతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. కేంద్రం నిధులు విడుదల చేయకపోతే సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వడం కాదు.. ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో తప్పని సరిగా కేంద్రం నుంచి సాయం అందాల్సి ఉంది. ఈ సమస్యలు అన్నీ నేరుగా ప్రధానికి వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు విభజన సమస్యలు.. హామీ ఇచ్చిన నిధులు వెంటనే విడుదల అయ్యేలా చూడాలని.. అప్పులు తీసుకునే అవకాశం కల్పించాలని ప్రధానిని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది...
అయితే ఈ సడెన్ ప్రధానితో సీఎం భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారు. విపక్షాలన్నీ ఇదే అభిప్రాయంలో ఉన్నారు. అది ఎంత వరకు నిజం అన్నది నేటి భేటీ తరువాత క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రధాని మోదీతో భేటీ తరువాత.. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను.. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలుస్తారని తెలుస్తోంది. అలాగే మంగళవారం ఉదయం మరో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలుస్తారని తెలుస్తోంది. మొత్తం రెండు రోజుల పాటు ఉండనున్న ఆయన.. ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ సడెన్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బయటకు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారని చెబుతున్నా.. ముందస్తు ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానికి సీఎం జగన్ మనసులో మాట చెబుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచింది అని జగన్ భావిస్తున్నట్టు పొలిటికల్ వర్గాల టాక్..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.