హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala on Employees: ఉద్యోగులకు శుభవార్త.. రెండు మెట్లు దిగామన్న సజ్జల.. కొత్త హామీలు ఇవే

Sajjala on Employees: ఉద్యోగులకు శుభవార్త.. రెండు మెట్లు దిగామన్న సజ్జల.. కొత్త హామీలు ఇవే

సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala on Employees: ఉద్యమానికి సై అంటున్న ఉద్యోగులకు శుభవార్త.. ఇప్పటికే దశల వారీ ఉద్యమానికి సిద్ధమైన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్.. వారంతా ప్రభుత్వంలో భాగమే అని.. అందుకే రెండు మెట్లు కిందకు దిగామన్నారు.. ఇంకా ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Sajjala on Employees: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల (Government Employees Unions) నేతలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ (Corona Virus) వల్ల రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలపై తామే రెండు మెట్లు దిగి చర్చిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 3 వేల కోట్ల మేర బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని సజ్జల స్పష్టం చేశారు. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామని ఆయన హామీ ఇచ్చారు. చిన్న చిన్న సమస్యలను కలిసి పరిష్కరించుకుంటామని సజ్జల స్పష్టం చేశారు.

తాజాగా జరిగిన చర్చల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. మరికొన్ని అంశాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, ఉద్యోగుల పెండింగ్ క్లెయింలను ఈ నెల 31 లోగా క్లియర్ చేస్తామన్నారు. జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ అరియర్స్ అన్నీ చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వ విజన్ సాధనలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉండాలని ఆయన చెప్పారు. కోవిడ్ కారణంగా ఆర్ధికంగా దెబ్బతిన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టం చేశారు. సమయానికి సర్ప్లస్ బడ్జెట్ లేక కొంత అసంతృప్తి ఉందని, ఆర్థిక వ్యవహారాలు పక్కన పెట్టి ఉద్యోగుల కనీస సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఇవాళ చర్చలకు అంత ప్రాధాన్యం ఉందనుకోలేదని, ఉద్యోగుల సమస్యలు చాలా వరకు తీర్చే ప్రయత్నం చేశామని సజ్జల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వారి ఖాతాల్లోకి డబ్బు జమ.. ఎంతంటే..?

అయితే మరోసారి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఉద్యోగులంటే ప్రభుత్వానికి చులకనభావం ఉందని.. అందుకే ఇకపై సమావేశాల పేరుతో కాలయాపన చేస్తే ఒప్పుకునేది లేదంటున్నాయి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని బొప్పరాజు మండిపడ్డారు. మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు? వైసీపీ ప్రభుత్వాన్ని బొప్పరాజు ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Employees, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు