హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏకంగా 5వేల ఫోన్లు రికవరీ.. ఆ విషయంలో ఏపీ పోలీసులే ఫస్ట్..

ఏకంగా 5వేల ఫోన్లు రికవరీ.. ఆ విషయంలో ఏపీ పోలీసులే ఫస్ట్..

మొబైల్ ఫోన్ల రికవరీలో ఏపీ పోలీసులు సూపర్

మొబైల్ ఫోన్ల రికవరీలో ఏపీ పోలీసులు సూపర్

AP Police: మొబైల్ ఫోన్ పోయిందంటే ఇక దానిపై ఆశలు వదులుకోవలసిందే..! కానీ ఇది ఒకప్పటిమాట.. ఇప్పుడు ఫోన్ పోతే కంగారు పడాల్సిన పనిలేదు. ఒక్క వాట్సాప్ మెసేజ్ తో పోయిన మీ మొబైల్ డోర్ డెలివరీ అవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

మొబైల్ ఫోన్ పోయిందంటే ఇక దానిపై ఆశలు వదులుకోవలసిందే..! కానీ ఇది ఒకప్పటిమాట.. ఇప్పుడు ఫోన్ పోతే కంగారు పడాల్సిన పనిలేదు. ఒక్క వాట్సాప్ మెసేజ్ తో పోయిన మీ మొబైల్ డోర్ డెలివరీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5,077 ఫోన్లు రికవరీ చేసి డోర్ డెలివరీ చేశారంటే మన పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా అనంతపురం జిల్లాలో మొబైల్స్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఎస్పీ ఫకీరప్ప ప్రారంభించారు. CHAT BOT మొబైల్ ఫోన్ల రికవరీ విజయవంతంగా సాగుతోందని.. ఇప్పటి వరకు రూ. 8.25 కోట్ల విలువ చేసే 5077 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఆయన వివరించారు.

ఒక్క అనంతపురం జిల్లాలోనే 700 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్ల వివరించారు. భారీ స్థాయిలో రికవరీ చేసి బాధితులకు అందివ్వటంలోశ్రమించిన జిల్లా పోలీస్ టెక్నికల్ విభాగాన్ని రాష్ట్ర డి.జి.పి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించినట్లు ఎస్పీ వెల్లడించారు.

బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి ఇవ్వాల నేసంకల్పంతో గత మార్చి 17 న ప్రారంభించిన వాట్సాప్ 9440796812 నెంబర్ ద్వారా సేవలు అందుతున్నాయి. దీనిపై మెరుగైన సేవలు అందించడానికి గత జూన్ 26న CHAT BOT సేవలు ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా సరికొత్తగా "ఉచిత డోర్ డెలివరీ " ప్రారంభించారు.

ఇది చదవండి: ఇది పొలంకాదు నందనవనం.. రైతు ప్రయోగం అదుర్స్

సుదూర ప్రాంతాల నుండీ ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు తీసికెళ్లాలంటే వ్యయ ప్రయాసలు ఎదుర్కోవటాన్నిదృష్టిలో ఉంచుకుని ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో, బాధితులకు నేరుగా ఇళ్లకు పంపేలా శ్రీకారం చుట్టామని ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. 15 రాష్ట్రాల బాధిత ప్రజలకు రికవరీ చేసి అందించిన మొబైల్ ఫోన్లు ఇతర రాష్ట్రాలైన కర్నాటక- 178, తెలంగాణ -117, కేరళ-31, మహరాష్ట్ర - 23, తమిళనాడు-17, ఒడిస్సా- 06.. ఉత్తరప్రదేశ్ - 06, డిల్లీ- 05, భీహార్ -04, మధ్యప్రదేశ్ - 04, రాజస్థాన్ - 03, పంజాబ్ -02, పశ్చిమ బెంగాల్ - 02, గోవా, హర్యానా రాష్ట్రాల నుండీ చెరో ఒక సెల్ ఫోన్ ప్రకారం మొత్తం 400 రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పారు.

ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా- 2951, శ్రీ సత్యసాయి జిల్లా- 797, కర్నూలు- 436, కడప - 133, చిత్తూరు- 88, నెల్లూరు- 46, తూర్పు గోదావరి-45, గుంటూరు- 41, ప్రకాశం-31, తిరుపతి- 31, పశ్చిమ గోదావరి- 23, కృష్ణి-16, విశాఖపట్నం-16, శ్రీకాకుళం-07, విజయవాడ-06, విజయనగరం-06, కాకినాడ-03, ఏలూరు- 01 ... మొత్తం 5077 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేశారు. వీటి మొత్థం విలువ సుమారు రూ. 8.25 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు