G Venkatesh, News18, Anantapuram
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) దూసుకుపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా పనుల కోసం ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా కర్ణాటకకు కూలీలు వలస వెళుతూ ఉంటారు. అనంతపురం జిల్లాలో ఎక్కువగా కరువు సంభవిస్తూ ఉంటుంది.ఇలాంటి సమయంలో పనులు దొరకక కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతూ ఉంటారు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తూ అనంతపురం దూసుకు వెళ్తా ఉంది. అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా కరువు ఉంటుంది.చేయడానికి పనులు ఉండవు.వ్యవసాయం చేసిన అర కొర మాత్రమేఉంటుంది. అలాంటి సమయంలో ఇక్కడ ప్రజలకు పనులు దొరకవు.అయితే ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చినప్పుడు నుంచి అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారు.
తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గత నాలుగు సంవత్సరాలలో కేవలం ఉమ్మడి అనంతపురం జిల్లాకే రూ.1,076 కోట్ల నిధులు పనులు చేసే వారి ఖాతాలోకి జమయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో అమౌంటు జమ అయ్యిందంటే పనులలో పురోగతి ఎంతుందో మనం గమనించవచ్చు. అయితే ప్రభుత్వం సంవత్సరంలో వంద రోజులు ఉపాధి హామీ పథకంలో భాగంగా పని కల్పించడంతో అనంతపురంలోని కూలీలకు పనులు దొరుకుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News