ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అక్రమాస్తులపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణకు లక్ష్మీ పార్వతి స్వయంగా హాజరయ్యారు. చంద్రబాబుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని.. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా రూ.300 మాత్రమే తీసుకున్న ఆయన.. వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో తేలాల్సి ఉందని అన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి.. ఆయన అక్రమాస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని లక్ష్మీ పార్వతి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు.
చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను కోర్టుకు సమర్పించిన లక్ష్మీ పార్వతి.. అసలు కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని లక్ష్మీ పార్వతి కోరారు. ఐతే ఈ కేసుపై ఇప్పటిక హైకోర్టు స్టే ఉందని.. చంద్రబాబు నాయుడు తరపు లాయర్ ఏసీబీ కోర్టు తెలిపారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థాన, హైకోర్టు స్టే వివరాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Chandrababu naidu, Hyderabad, Lakshmi Parvathi