ఓ ఆయుర్వేద వైద్యుడు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి పూట శ్మశానంలో క్షుద్రపూజలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తెలంగాణ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో చోటుచేసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం) వివరాలు.. ఆర్మూర్లోని ప్రియాంక క్లీనిక్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు సమీర్ రాయ్ సోమవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు చేయసాగాడు.(ప్రతీకాత్మక చిత్రం) అయితే అనుమానం వచ్చిన కొందరు స్థానికులు అటుగా వెళ్లి చూశారు. దీంతో సమీర్ రాయ్ కుటుంబం శ్మశాన వాటికలో కనిపించింది. దీంతో స్థానికులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. (ప్రతీకాత్మక చిత్రం) కోల్కత్తాకు చెందిన సమీర్ రాయ్ కుటుంబం 15 ఏళ్ల క్రితం ఆర్మూర్కు వలస వచ్చినట్టుగా తెలిసింది.(ప్రతీకాత్మక చిత్రం) ఇంట్లో సమస్యలు ఉన్నాయని.. పూజారి సలహా మేరకే ఈ పూజలు చేస్తున్నట్టుగా సమీర్ రాయ్ అక్కడి వారిని నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)